- Advertisement -
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకుల తనయులు ఈ పార్టీకి హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా రేవ్ పార్టీలో వినిపించిన పేరు హేమ.
అయితే తాను ఈ రేవ్ పార్టీకి వెళ్లలేదని తొలుత బుకాయించిన ఆమె విడుదల చేసిన వీడియోనే అడ్డంగా బుక్ అయ్యేలా చేసింది.హేమ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు ఉండటంతో విచారణకు రావాల్సింది పోలీసులు నోటీసులు జారీ చేశారు.
అయితూ తాను వైరల్ ఫివర్ తో బాధపడుతున్నానని అందుకే విచారణకు హాజరు కావడం లేదని తెలిపారు హేమ. ఈ మేరకు బెంగళూరు సీసీబీకి లేఖ రాశారు. విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని కోరగా మరోసారి ఆమెకు నోటీసులు పంపించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మొత్తంగా టాలీవుడ్ని మరోసారి డ్రగ్స్ అంశం మరోసారి కుదిపేసింది.