Friday, May 3, 2024
- Advertisement -

ఆర్య భార్య తో అఖిల్ రొమాన్స్?

- Advertisement -

వరుస పరాజయాల తర్వాత అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం పైన ఫోకస్ చేసాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో త్వరలో రానున్న ఈ చిత్రానికి హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. మొదటగా పూజ హెగ్డే, కైరా అద్వానీ ని సినిమా లో కి తీసుకోవాలని భావించినా వారు బిజీ అని చెప్పడం తో సినిమా యూనిట్ వెనుకంజ వేశారు. ఆ పిమ్మట రష్మిక కోసం గట్టిగా ట్రై చేసారు నిర్మాతలు. రష్మిక కోసం పారితోషికం పెంచడానికి కూడా రెడీ అయ్యారు సినిమా యూనిట్ కానీ అనుకోని కారణాల వలన రష్మిక కూడా ఈ సినిమా చేయలేనని చెప్పేయడం తో ఎవరినీ తీసుకోవాలా అని చిత్ర యూనిట్ సందిగ్దామ్ లో పడింది.

అయితే తాజా ఫిలిం నగర్ సమాచారం మేరకు తన తో పాటు అరంగేట్రం చేసిన సయేశా తో ఈ సినిమా లో నటించాలని అఖిల్ అనుకుంటున్నాడట. తమిళం లో వరుస విజయాలు అందుకొని తమిళ హీరో ఆర్య ని ప్రేమించి పెళ్లాడిన సయేశా కి ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. అందుకే మళ్ళీ అఖిల్ సినిమా కాంబినేషన్ ని రిపీట్ చేయాలనీ అంతా భావిస్తున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -