Sunday, May 5, 2024
- Advertisement -

నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందట!

- Advertisement -

కాస్త కూస్తో బుల్లితెర మీద వచ్చిన ఇమేజ్ తో వెండితెర మీద వెలుగు వెలిగాలన్న ఆలోచనలో ఉన్న అనసూయ నటించిన రెండు సినిమాలు హిట్ అందుకుంది. అయితే అందులో క్షణంలో మంచి రోల్ ప్లే చేసినా సోగ్గాడే చిన్ని నాయనాలో ఆమెది అంత ఇంపార్టెంట్ రోల్ ఏం కాదు. అయితే ఈ రెండు సినిమా అనుభవంతోనే అమ్మడు దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందట.

తన దగ్గరకు హీరోయిన్ గా అడిగేందుకు వచ్చిన అనసూయ అక్షరాల 40 లక్షల పారితోషికం అడుగుతుందని టాక్. ఇద్దరి పిల్లల తల్లయిన అనసూయ కనీసం హీరోతో ఏమన్నా రొమాన్స్ చేయగలదా అంటే అదీ లేదు! మరి అలాంటప్పుడు ఆమెకు అంత ఇవ్వడానికి ఎవరు ముందుకొస్తారు చెప్పండి.

సో అందుకే ఆమెను కాదని కొత్త వారిని తీసుకుంటున్నారట. అందుకే సోగ్గాడు, క్షణం తర్వాత అనసూయ ఇంకా దేనికి ఓకే కాలేదు. మరి కెరియర్ స్టార్టింగ్ లో వచ్చిన అవకాశాలను చేసుకుంటూ పోవాలి కాని ఇలా రెమ్యునరేషన్ అంటూ వదులుకుంటే అమ్మడు ఎంతో కాలం నిలిచే అవకాశం ఉండదు. మరి ఈ విషయంపై అనసూయకు ఎవరైనా క్లారిటీ ఇస్తే మంచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -