Wednesday, May 15, 2024
- Advertisement -

ఆలికి మళ్లీ పగిలింది!

- Advertisement -

కమెడియన్ ఆలీకి మళ్లీ పగిలింది. ఈసారి అలా ఇలా కాదు.డైరెక్ట్ గా స్టేజ్ మీదనే పగిలింది. దేని తోకో వంకరన్నట్లు అలీకి ఎంతమంది ఎన్నిసార్లు విన్నవించుకున్నా…టంగ్ స్లిప్ విషయంలో మాత్రం మనోడు మారడం లేదు.

నిజానికి ఆలీ విషయంలో ఇది ఎప్పుడూ జరిగే సీనే. కాకపోతే ఈసారి డైరెక్ట్ ఎటాక్ అన్నమాట. ఎప్పటిలాగే అలీ, ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ అనే ఆడియో ఫంక్షన్ లో యాక్టర్స్ పై తన నోటి దురుసుని చూపించాడు. ఇందులోని భాగంగానే కో యాంకర్ గీతామాధురిని సైతం వదల్లేదు. అల్లరినరేష్ ని స్టేజ్ పైకి పిలిచిప్పుడు, నరేష్ పై అలీ జోకులు పేల్చాలని చూశాడు. వీరిద్దరి మాటల మధ్యలోకి అలీ గీతామాధురిని లాగాడు. ఆలి బిత్తర మాటలకు వెంటనే రియాక్ట్ అయిన గీతామాధురి స్టేజ్ మీదనే తన పదునైన మాటలతో ఒక్కటిచ్చింది.

ఇదనే కాదు…. గతంలో కూడా సుమ,శ్యామల లాంటి యాంకర్ల విషయంలోను ఆలికి చాలా ఎదురు దెబ్బలు తగిలాయి.అయితే అవన్నీ అందరి ముందు జరగలేదు. కాని అప్పట్లో స్టేజ్ పై ఆలి పలికిన కొన్ని కొంటె పలుకులకు… తోటి యాంకర్లు ఇబ్బంది పడ్డారు.అపుడే మనోడికి లేడీ యాంకర్లు వార్నింగ్ ఇచ్చినట్లు చెపుకున్నారు. యాంకర్ల విషయంలో మాత్రమే ఆలీబాబా ఇలా చేస్తున్నాడని అనడానికి వీల్లేదు.ఎందుకంటే అతను గతంలో సమంతా,రకుల్,రాశి ఖన్నాల  విషయంలోను ఇలాగే టంగ్ స్లిప్ అయ్యాడు.

అపుడూ మాటల వాతలు ఈవెంట్ అనంతరం మనోడికి చాలా పడ్డాయని చెపుకున్నారు.రీసెంట్ గా ఓ రియాల్టీ షోలో ఇదే విషయమై కొందరు అతన్ని కొశ్చన్ చేశారు. దానికి ఆలీ చెప్పిన సమాదానం కూడా కరెక్ట్ గా లేదు.

కమెడియన్ కామెడీ చేయకపోతే ఏం చేస్తాడని ఆలీ చెబుతున్నాడు. అంటే ఆలి దృష్టిలో కమెడియన్ అంటే తోటి లేడీ యాంకర్లు,హీరోయిన్లపై ఘాటు వ్యాఖ్యలు చేయడమేనా అని అర్ధమొస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -