దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్'(జీఎస్టీ) షార్ట్ ఫిల్మ్ ఓ సంచలనం. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో తెరకెక్కించిన ఈచిత్రం ఆకట్టుకోలేదు కానీ.. వివాదం అయితే అయ్యింది ‘జీఎస్టీ-2’ కూడా తీయడానికి సిద్ధమయ్యారు వర్మ. అయితే సినిమా విడుదలకు ముందు ఎన్ని వివాదాలు ఎదుర్కొందో అందరికి తెలిసిందే.
కేవలం వర్మ మాత్రమే కాదు.. మిగతా సినీ జనాలు కూడా అనేక మంది జీఎస్టీ 2 గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కోరు ఒక్కో రకమైన ప్రకటన చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఈ అంశంపై యాంకర్ రష్మీ కూడా స్పందించింది. దీంతోజీఎస్టీ-2 తీస్తానని ప్రకటించారు వర్మ.
పలు సినిమాల్లో నటించి, హాట్ హాట్ గా కనిపించిన రష్మీ.. జీఎస్టీ సెకెండ్ పార్ట్ లో నటించడానికి సై అని ప్రకటించింది. అయితే ఇక్కడ ఈమె ఒక షరతు విధించింది. దానికి దర్శకుడి విషయంలో కండీషన్ పెట్టింది రష్మీ. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తే తను ఆ సినిమాలో నటిస్తాను అని రష్మీ ప్రకటించింది. ట్విటర్లో తన అభిమానులతో చాట్ లో ఈ విషయాన్ని ప్రకటించింది ఈ హాట్ యాంకర్.
జీఎస్టీ 2లో నటించడానికి తను సిద్ధమని.. అయితే దానికి ప్రవీణ్ దర్శకత్వం వహించాలని అంటోంది ఈమె. ఇది వరకూ ప్రవీణ్ దర్శకత్వంలో రూపొందిన ‘గుంటూర్ టాకీస్’లో ఈమె నటించింది.
ఈ వార్తలపై యాకర్ రష్మి తాజాగా సోషల్ మీడియా ద్వారా …. తాను ‘జిఎస్టీ-2’లో నటించడానికి సిద్ధమే అని ప్రకటించినట్లు వార్తలు రావడం వివాదానికి దారి తీసింది. మరో సారి ప్రవీణ్ దర్శకత్వంలో నటించడానికి రష్మీ ఉబలాటపడుతోంది.