వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యూహం. సినిమా టైటిల్ అనౌన్స్ చేయడంతోనే వివాదానికి ఆజ్యం పడగా ట్రైలర్,టీజర్,సెన్సార్ ఇలా ప్రతీది కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రసే. అందుకే సినిమా విడుదలకు పలుమార్లు బ్రేక్ పడింది.
అయితే తాజాగా సినిమాకు అడ్డంకులు తొలిగాయి. హైకోర్టు సూచనలతో సినిమాకు రెండోసారి సెన్సార్ సర్టిఫికేటును విడుదల చేయడంతో ఈనెల 16న సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
వాస్తవానికి సినిమా సెన్సార్ పూర్తి కాగానే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు టీడీపీ నేత లోకేష్. సినిమాను విడుదల చేయవద్దంటూ కోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు.దీంతో విడుదలకు బ్రేక్ పడగా తాజాగా దర్శకుడి వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం మరోసారి సెన్సార్ చేయాలని ఆదేశించింది. దీంతో చిత్రాన్ని పరిశీలించిన సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేట్ను జారీ చేసింది.