తెలుగు బుల్లితెర యాంకర్స్ సుమ, అనసూయ ఇక షూటింగ్స్ కొన్ని రోజులు చేయొద్దని ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ప్రస్తుతం బుల్లితెరపైన కూడా కరోనా విజృంభిస్తుండటంతో కొద్దిరోజులపాటు షూటింగ్లకు సెలవు చెప్పాలని ఈ యాంకర్లు నిర్ణయం తీసుకున్నారట. ఇటీవలే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు షూటింగ్ లకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ జరుపుకోవాలని ప్రభుత్వాలు సూచించాయి.
దీంతో జూన్ రెండో వారం నుంచి సినిమా, టీవీ షూటింగ్లు తిరిగి మొదలయ్యాయి. అయితే, టీవీ పరిశ్రమలోని పలువురు నటీనటులు కరోనా పాజిటివ్ రావడంతో భయాందోళన మొదలైంది. బుల్లితెర పై కరోనా మరింత వ్యాపి చెందకుండా ఉండాలంటే షూటింగ్స్ ఆపివేయాలని నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుతం షూటింగ్లు కొనసాగిస్తున్న వాటిలో సుమ ‘క్యాష్’, అనసూయ ‘జబర్దస్త్’ కూడా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ తమ షోల షూటింగుల్లో పాల్గొంటున్నారు. అయితే, కొద్ది రోజులపాటు ఈ షూటింగ్లకు దూరంగా ఉండాలని సుమ, అనసూయ నిర్ణయం తీసుకున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి.
ఇలాంటి సమయంలో రిస్క్ తీసుకోవడం మంచిదికాదని ఈ యాంకర్స్ భావిస్తున్నారట. అయితే లాక్ డౌన్ టైంలో షూటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ను అనసూయ కోరింది. ఇంట్లో ఉంటే ఆదాయం రాదని.. ఈఎంఐలు కట్టుకోవాలని.. అందుకే షూటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వాలని అనసూయ కోరింది. ఇప్పుడు షూటింగ్స్ మొదలైన తర్వాత అనసూయ షూటింగ్స్ కి సెలవు పెట్టాలని అనుకుంటుందట. ప్రస్తుతం హల్ చల్ చేస్తున్న ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.
వర్మ ’పవర్ స్టార్’మూవీపై పవన్ కళ్యాణ్ రియాక్షన్..!
పెళ్లి తర్వాత నటిస్తే తప్పేంటి ? : శ్రద్ధా శ్రీనాథ్