ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో బిజీగా ఉన్నాడు. మార్చ్లో ఆడియోని విడుదల చేసి ఈ సమ్మర్లో మూవీ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. పవన్ సరసన హీరోయిన్గా కాజల్ నటిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా ఈ సమ్మర్లో తన సినిమాతో రాబోతున్నాడు.
నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్కు మంచి స్పందనతో పాటు సినిమా పై మరింత అంచనాలు పెరిగిపోయాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ సినిమాలో సమంత, కేథరిన్ లు హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరి మెగా హీరోలకు పోటి ఇవ్వాడానికి మరో మెగా హీరో రెడి అవుతున్నాడు.
సాయి థరం తేజ్ హీరోగా అనిల్ రవి పూడి దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మిస్తున్న చిత్రం సుప్రీమ్. ఈ సినిమాని కూడా ఇప్పుడు సమ్మర్లోనే రిలీజ్ చేయ్యాలని ప్లాన్ చేస్తున్నాడట దిల్ రాజ్. ఇప్పటికే ఈ సినిమా అన్నీ ఏరియాలలో బిజినేస్ పూర్తి చేసుకుందట. ఏది ఎమైన ఒకేసారి ముగ్గురు మెగా హీరోలు రావడం సమ్మర్లో మెగా అభిమానులకు పండగే అని చెప్పాలి.