ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మార్చిలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కానుండగా ఏప్రిల్ – మే నెలలో ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. దీంతో ప్రధాన పార్టీలన్ని ప్రజాక్షేత్రంలో ఉంటూ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక ఇప్పటికే పవన్ సినిమా షూటింగ్లకు గ్యాప్ ఇచ్చి పూర్తి స్థాయి రాజకీయాల్లో పాల్గొంటుండగా తాజాగా బాలయ్య కూడా పవన్ బాటలోనే నడుస్తున్నారు.
ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమాలకు బ్రేకప్ చెప్పాలని నిర్ణయించుకున్నారు. దీంతో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో పాటు మరిన్ని బాలయ్య సినిమాలకు బ్రేక్ పడనుంది. బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా బాలయ్య కెరీర్లో 109వది.
1980 బ్యాక్డ్రాప్ తో ఉండనున్నట్లు తెలుస్తోండగా ఇప్పటికే ఊటీలో భారీ యాక్షన్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. తర్వాత షెడ్యూల్లో రాజస్థాన్లో జరగనుందని తెలుస్తోండగా అక్కడ ఓ యాక్షన్ షెడ్యూల్ని ప్లాన్ చేశారు. అయితే ఇంతలోనే బాలయ్య సినిమాలకు బ్రేకప్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం అభిమానులను షాక్కు గురి చేసింది. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి.