Saturday, April 20, 2024
- Advertisement -

చిరు, బాలయ్య మధ్య గొడవ.. ఎందుకోసం..?

- Advertisement -
balakrishna chiru theaters war

దాదాపు 12 సంవ‌త్స‌రాల త‌ర్వాత టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ తమ కేరీర్‌లో ల్యాండ్ మార్క్ చిత్రాలు అయిన ఖైదీ నెంబ‌ర్ 150, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.

ఈ రెండు చిత్రాలు దేనికవే చాలా ప్రత్యేకమైనవి. ఇది ఇలా ఉంటే.. ఈ ఇద్దరు పెద్ద హీరోల సినిమాల కోసం ఏపీ, తెలంగాణ‌లో భారీ ఎత్తున థియేట‌ర్ల వార్ నడుస్తోంది. రెండు పెద్ద చిత్రాలే అవ్వడంతో సినీ నిర్మాతలు ఎవరికి వారు వీలైనన్ని థియేటర్లను బ్లాక్ చేసుకునే చాన్స్‌లు ఉన్నాయి. చిరు చిత్రంకు నైజాంలో కాస్త ఎక్కువుగా థియేట‌ర్లు దొరుకుతుంటే, సీమ‌లోను, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో బాలయ్య చిత్రాన్నికి ఎక్కువ థియేట‌ర్లు దొరుకుతున్నాయి. ఇక వీరిద్దరి మధ్య మూడో పోటీగా శ‌ర్వానంద్ శ‌త‌మానం భ‌వ‌తిని కూడా సంక్రాంతికే తీసుకొస్తున్నాడు.

ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు నైజాం, ఉత్తరాంధ్ర ఏరియాల్లో గట్టి పట్టున్న డిస్ట్రిబ్యూటర్ కావడంతో దిల్ రాజు కూడా శ‌త‌మానం భ‌వతి కోసం ఎక్కువుగా థియేట‌ర్లు లాక్ చేస్తున్నాడు. ఈ మూడు చిత్రాలు 11, 12, 14వ డేట్‌ల్లో కేవలం ఒక్క రోజు గ్యాప్‌లోనే రిలీజ్ కాబోతున్నాయి. దీంతో ఓవరాల్ గా సినిమా విడుదల సమయానికి ఏ చిత్రంకు ఎక్కువ థియేటర్లు దొరుకుతాయా అన్నది.. ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

Related

  1. పవన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన చిరు!
  2. ఖైదీ నెం.150 గురించి చిరు షాకింగ్ కామెంట్స్!
  3. చిరు టార్గెట్ తెలుస్తే షాక్ అవుతారు!
  4. ‘అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు’ అంటున్న చిరు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -