Monday, April 29, 2024
- Advertisement -

” బాలయ్య తప్పుగా మాట్లాడారు “- హీరోయిన్

- Advertisement -

సావిత్రి సినిమా ఆడియో వేడుక లో నోటికి ఒచ్చినట్టు మాట్లాడిన హీరో బాలకృష్ణ మీద విపరీతమైన నెగెటివ్ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. పవిత్ర ప్రేమ సినిమా గురించి ప్రస్తావిస్తూ ” అమ్మాయిలు వెంట పడితే కమిట్మెంట్ అయినా ఇవ్వాలీ కడుపు అయినా చేసెయ్యాలి ” అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

ఆ వేదిక మీద తెలుగు తెలిసిన అమ్మాయిలు ఎవ్వరూ లేరు అని ఎవ్వరికీ తను అన్న మాటలు హర్ట్ అయ్యేలా తగలలేదు అని బాలయ్య కవరింగ్ బాగానే చేసుకున్నారు కానీ ఆ స్టేజీ మీద తెలుగు అమ్మాయి నందిత ఉండనే ఉంది. ఆ సినిమాకి ఆమె హీరోయిన్ గా చేస్తూ ఉండగా ఈ వ్యవహారం గురించి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో బయటపడింది ఆమె. “స్టేజీపై బాలకృష్ణ చెప్పిన ఆ మాటలు విన్నప్పుడు మీకేమనిపించింది?“  అన్న ప్రశ్నకు నందిత స్పందించింది.

“నేనూ తెలుగమ్మాయినే. ఆ మాటలు నాకూ అర్థమయ్యాయి. బాలకృష్ణగారు అలా ఎందుకు అన్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. నాకైతే స్టేజీపై ఇబ్బందిగా అనిపించింది“ అని చెప్పుకొచ్చింది నందిత. అందరి హీరోయిన్లలాగే ఏదో ఒకటి సర్ది చెబుతుందిలే అనుకొన్న విలేకర్లకు నందిత ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది. నందిత స్వతహాగా తెలుగమ్మాయి కావడంతో పాటు ఆమె మిలిటరీ ఫ్యామిలీ నుంచి వచ్చింది. అందుకే అంత ధైర్యంగా తన మనసులో ఉన్న విషయాన్ని ఉన్నదున్నట్టు బయటపెట్టిందని చర్చించుకుంటున్నాయి పరిశ్రమ వర్గాలు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -