ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా సేవలు అందించిన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా యాత్ర. ఈ సినిమాకు రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు.సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రను సీనియర్ హీరో మమ్ముట్టి నటిస్తున్నారు.ఇక వైఎస్ జగన్ పాత్రలో తమిళ హీరో సూర్య నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే సినిమాలో వైఎస్ కుతురు షర్మిల పాత్ర కోసం హీరోయిన్ భూమికను తీసుకున్నారనే వార్తలు వినిపించాయి.
అయితే ఇందులో నిజం లేదని చిత్ర యూనిట్ ప్రకటించింది.అసలు సినిమాలో షర్మిల పాత్ర ఉండదని,సినిమా ప్రధానంగా వైఎస్ పాదయాత్ర చుట్టూ తిరుగుతుందని, కేవలం రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారని టాక్. గాంధీభవన్, పార్టీ మీటింగ్స్ తదితర అంశాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు ఫ్యామిలీను పెద్దగా టచ్ కూడా చేయడం లేదని తెలుస్తోంది.దీంతో సినిమాలో షర్మిల,విజయమ్మ,భారతి పాత్రలు ఉండవని తెలుస్తుంది.