Tuesday, April 30, 2024
- Advertisement -

బోయపాటితో AA..లోడింగ్ సూన్!

- Advertisement -

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో రాబోతుంది. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌తో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ మరోసారి సినిమా తీయబోతున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ మూవీ తెరకెక్కనుండగా మాసివ్ ఫోర్సెస్ అంటూ పోస్టర్ ద్వారా వెల్లడించారు. గతంలో బోయపాటి – అల్లు అరవింద్ కాంబోలో వచ్చిన సరైనోడు బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.

ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా హీరో అల్లు అర్జున్‌ అనే తెలుస్తోంది. ప్రస్తుం పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు బన్నీ. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు సందీప్ వంగ సినిమాలు చేయనున్నారు.

అయితే వీటిని పక్కకు పెట్టి బోయపాటితో సినిమా తీస్తారా అన్నది తెలియాల్సి ఉంది. భ‌ద్ర, తుల‌సి, సింహా, లెజెండ్‌, స‌రైనోడు, అఖండ‌ మాస్ చిత్రాలను తెరకెక్కించారు బోయపాటి. వైవిధ్య‌మైన వాణిజ్య క‌థాంశాల‌ను జోడించి తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు. వీరిద్దరి కాంబోలో సినిమా అనగానే భారీ అంచనాలు నెలకొనగా త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్‌కు సంబంధించిన మ‌రిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -