Thursday, May 16, 2024
- Advertisement -

30 కోట్లు డిమాండ్ చేస్తున్నారట!

- Advertisement -

మొత్తానికి చిరంజీవి 150 వ సినిమాని నెమ్మదిగా మోదలు పెట్టించాడు హీరో రాం చరణ్. ఎప్పటి నుంచో డిస్కషన్ లో ఉన్న ఈ స్క్రిప్ట్ కి  రాం చరణ్ కొత్త బ్యానర్ ఓపెన్ చేసి మరీ , డైరెక్టర్ వినాయక్ ని పిలిపించి మరీ కొబ్బరి కాయ కొట్టి పెద్ద హడావిడి చేసి షూటింగ్ మొదలెట్టారు. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర చర్చ సాగుతోంది.

సాధారణంగా సొంత బ్యానర్ లో ఏ హీరో అయినా సినిమా చేస్తూ ఉన్నట్టు అయితే అందులో పారితోషికం గురించి అసలు పట్టించుకొనే కోరు ముఖ్యంగా ఫామిలీ ల హీరోలు ఆ విషయం లెక్క జేయరు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించి నటించిన ఏ సినిమాలోనూ నాగార్జున రెమ్యునరేషన్ తీసుకున్న వార్తలు లేవు. అలానే దగ్గుబాటి వారి ఫ్యామిలీ కుడా. ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే గీతా ఆర్ట్స్ తో అల్లు అర్జున్ చేసిన ఏ సినిమాకు బన్నీ పారితోషికం పట్టించుకోడని టాక్.

చరణ్ కూడా తన మూడవ సినిమా ఆరెంజ్ నాగబాబు బ్యానర్ లో తీసిన నేపధ్యంలో పేమెంట్ అడగలేదని వార్తలు వినిపించాయి. కానీ చిరంజీవి మాత్రం రాం చరణ్ దగ్గర ఆన్యాయం గా 30 కోట్లు తీసుకుంటున్నారు అని తెలుస్తోంది. బడా హీరోల కంటే చాలా ఎక్కువగా డబల్ లో చిరు డిమాండ్ చేస్తున్నారట. ఈ విషయం లో రాం చరణ్ కూడా ఓకే చెప్పి అంతా పక్కా గా ఉండాలి అని అగ్రిమెంట్ కూడా రాయిస్తున్నాడు అని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -