Thursday, March 28, 2024
- Advertisement -

మరోసారి మెగాస్టార్ తో వినాయక్..!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వీవీ వినాయక్ లది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు బంపర్ హిట్లు గా నిలిచాయి. చిరంజీవి, వీవీ వినాయక్ ల కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా ఠాగూర్. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డు సాధించడమే కాదు. ఒక మంచి సందేశాత్మక చిత్రంగా నిలిచింది. చిరంజీవికి ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తరువాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడంతో మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు.

రాజకీయాల కారణంగా పదేళ్ల పాటు విరామం తీసుకున్న చిరంజీవి.. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ మొదటగా వినాయక్ కే మళ్లీ అవకాశం ఇచ్చాడు. తమిళ కత్తి సినిమా రీమేక్ బాధ్యతలను వినాయక్ సమర్థవంతంగా నిర్వహించాడు. అలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ఖైదీ నెంబర్ 150 గ్రాండ్ హిట్ కొట్టింది. చిరంజీవి రీ ఎంట్రీకి సరైన సినిమాగా నిలిచింది. వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.

ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మలయాళ లూసిఫర్ సినిమాను చిరంజీవి తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ వినాయక్ ఇచ్చి కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చాలని చిరంజీవి కోరాడు. అయితే వినాయక్ మార్చిన స్క్రిప్ట్ చిరంజీవికి అంతగా నచ్చలేదని సమాచారం.

Also Read: ఏ సినిమా విడుదల ఎప్పుడు? అంతా గందరగోళమే..!

ఆ తర్వాత ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు తమిళ డైరెక్టర్ అయినా మోహన్ రాజకు అప్పగించాడు చిరంజీవి. అయితే వినాయక్ చిరంజీవితో మరో సినిమా చేసేందుకు ఆసక్తి గా ఉన్నాడని టాక్. ఇటీవల వినాయక్ చిరంజీవిని కలిసి ఓ కథ వినిపించినట్లు తెలిసింది. చిరంజీవి కోసం వినాయక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సాగే ఓ స్క్రిప్టును రెడీ చేయించారట. ఈ కథ విన్న చిరంజీవి ఇంకా ఏమి డిసైడ్ చేయలేదని సమాచారం. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా తో పాటు, లూసిఫర్ రీమేక్, బాబీ, మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు. చిరంజీవి వినాయక్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో వేచి చూడాలి.

Also Read:ఆ ఇద్దరు అగ్ర హీరోలూ.. అలా చేయడం ఇదే తొలిసారి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -