టాలీవుడ్ సంచలన నటి శ్రీరెడ్డి మళ్లీ వార్తల్లో నిలిచింది.శ్రీరెడ్డిని బిగ్బాస్-2 తీసుకున్నారనే వార్త సంచలనంగా మారింది.శ్రీరెడ్డిని బిగ్బాస్లో తీసుకోవడంపై మిశ్రమ స్పందన వస్తుంది.ఆమెను ఎలా తీసుకుంటారని కొందరు ప్రశ్నిస్తుంటే, శ్రీరెడ్డిని తీసుకుంటే షోకి మంచి రేటింగ్స్ వస్తాయని మరికొందరు భావిస్తున్నారు.అయితే శ్రీరెడ్డిని బిగ్బాస్లోకి తీసుకున్నారనే వార్త విన్న దగ్గబాటి సురేష్ బాబు షో నిర్వాహుకులను పిలిచి మరి వార్నింగ్ ఇచ్చరనే వార్తలు వినిపిస్తున్నాయి.
మీరు శ్రీరెడ్డి తీసుకుని ఆమెను మరింత పాపులర్ చేయలని చూస్తున్నారా! అని గట్టిగానే వాదించారట.మీరు శ్రీరెడ్డిని తీసుకుంటే షోనే ఆపేస్తానని అవసరం అయితే బిగ్బాస్ టీంతో నేనే మాట్లాడతాను అని అనడంతో ఈ వ్యవహరం పెద్దది కావడం ఇష్టం లేక బిగ్బాస్ టీం శ్రీరెడ్డిని షో నుండి తప్పించరని తెలుస్తుంది.అయితే ఈ వ్యవహరంలో ఎన్టీఆర్ ప్రమేయం కూడా ఉందని సమాచారం.బిగ్బాస్లో శ్రీరెడ్డిని పెడితే ఈ షో రచ్చ రచ్చ అవుతుందని భావించిన ఎన్టీఆర్ ఆమెను ఈ షోలో తీసుకోవద్దని బిగ్బాస్కు సలహ ఇచ్చాడని తెలుస్తుంది.
ఎన్టీఆర్ బిగ్బాస్ -1కు యాంకర్గా వ్యవరించాడు.త్రివిక్రమ్ సినిమా ఉండటంతో బిగ్బాస్ -2 నుండి తప్పుకున్నాడు ఎన్టీఆర్.వీరే కాకుండా మరికొంత మంది ఆమెను ఈ షో నుండి తప్పించేలా పైరవీలు చేశారని వినికిడి.టాలీవుడ్లో కాస్టీంగ్ కౌచ్ గురించి తీవ్ర పోరాటం చేసిన శ్రీరెడ్డి,దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు దగ్గుబాటి అభిరామ్ తనకు అవకాశాలు ఇస్తానని చెప్పి తనను లైంగికంగా వాడుకున్నాడని చెప్పి సంచలనం రేపింది.
నటుడు ,జనసేన అధినేత పవన్ కల్యాణ్,వాళ్ల అమ్మాగారిపై అనుచిత వాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలైంది.తరువాత కాలంలో శ్రీరెడ్డిని మీడియా వాళ్లు పట్టించుకోవడం మానేశారు.మరి శ్రీరెడ్డికి బిగ్బాస్లో అవాకాశం వచ్చిందో లేదో ఆమె తెలపాలి.ఈ వార్తల్లో ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది.