Saturday, April 20, 2024
- Advertisement -

పుష్ప విలన్ ని మళ్ళీ మార్చేసిన దర్శకుడు…!

- Advertisement -

అల్లు అర్జున్ సుకుమార్ కాంబో వస్తున్న పుష్ప సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. ఇప్పటికే వీరి కాంబో లో ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీంతో మూడో సినిమాపై సహజంగానే అంచనాలు ఉంటాయి.. అయితే రంగస్థలం లాంటి హిట్ కొట్టినా సుకుమార్ కి ఏదీ కలిసి రావట్లేదు అని చెప్పాలి… అన్ని బాగుంటే ఇప్పటికే మహేష్ బాబు తో సినిమా చేసి రిలీజ్ చేయాల్సి ఉండేది. కానీ విధి ఆడిన నాటకంలో మహేష్ సుకుమార్ కి హ్యాండ్ ఇవ్వడం సుకుమార్ తనకు అచ్చోచ్చిన హీరో అయిన అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేయడం జరుగుతుంది.

ఇటీవలే కేరళ అడవుల్లో ఈ సినిమా షూటింగ్ ని మొదలుపెట్టారు..అల్లు అర్జున్ తో సహా ఈ సినిమా లో నటించే నటీనటులు అందరు ఈ షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారని తెలుస్తుంది.. ఇక మొదటినుంచి అనుకున్నట్లు సినిమా విలన్ పై రోజు కో పేరు వినిపిస్తుంది.. ఇప్పటికే ఈ సినిమా కి విజయ్ సేతుపతి ని విలన్ గా ఫిక్స్ చేయగా డేట్ సమస్య వల్ల ఆయన ఈ సినిమా కి దూరమయ్యారు..

దాంతో ధృవ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అరవింద్ స్వామి ని పెట్టాలనుకున్న. కానీ అరవింద్ స్వామి కూడాఈ సినిమా చేయడానికి సముఖంగా లేదు.. దాంతో పరభాషల్లోని నటులకు వెళ్లడం ఎందుకని అనుకున్నారో ఏమో ఈ విలన్ పాత్ర కు యంగ్ హీరో నారా రోహిత్ ని పరిశీలిస్తున్నారట.. ఇప్పుడు అది కూడా కాకుండా మాధవన్ ని సినిమా లో విలన్ గా ఫిక్స్ చేయాలనీ చూస్తున్నారట.. ‘సవ్యసాచి’ సినిమా ఆడకపోయినా ఆ సినిమాలో విలన్ పాత్రతో మెప్పించి.. ‘నిశ్శబ్దం’లోనూ ఓ విలక్షణ పాత్రలో కనిపించనున్న మాధవన్‌ను ‘పుష్ప’లో విలన్‌ పాత్రకు పరిశీలిస్తున్నారంటూ ఒక రూమర్ వినిపిస్తోంది. మరి ఇదెంత వరకు నిజమన్నది తెలియదు. ఏదేమైనా సుకుమార్ విలన్ విషయంలో ఇంత జాప్యం చేసాయడం అల్లు అర్జున్ ఫాన్స్ కి ఏమాత్రం నచ్చడం లేదు..

అల్లు అర్జున్ పుష్ప ప్లేస్ మారబోతుందా…?

పాత పద్ధతినే సుకుమార్ ఫాలో అవుతున్నడా..!!

పుష్ప సినిమా కాపీనా..!!

పుష్ప లో వైసీపీ ఎమ్మెల్యే రోజా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -