రంగస్థలం సినిమా తర్వాత చాల గ్యాప్ తీసుకున్న సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొదలు కాగా ఈ సినిమా లో బన్నీ రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు.. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ లు ప్రేక్షలను ఇప్పటికే మెప్పించగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఇక ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా ఈ సినిమా స్టోరీ నాదే అంటూ ఓ ఇప్పుడు గళం విప్పుతున్నారు..
అయితే అతను సదా సీదా రచయిత అయితే ఏమో అనుకోవచ్చు. కానీ కేంద్ర సాహిత్య యువ పురస్కారాన్ని అందుకున్న రచయిత.. వేంపల్లి గంగాధర్. ఈయన ఈ సినిమా కథ తాను రాసిన ఓ పుస్తకంలోనిది అంటూ ఆరోపిస్తున్నారు.. తాను రాసిన ‘తమిళ కూలీ’ కథనే ‘పుష్ష’గా తీస్తున్నారని ఆరోపిస్తుండగా గతంలో అరవింద సమేత చిత్రం కథ కూడా తనదేనని అయన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. అందులో ఐదు పైసల్ ఫ్యాక్షన్ అనే కాన్సెప్ట్ ని తాను రాసిన మొండి కత్తి అనే పుస్తకంలోంచి కాపీ కొట్టారని ఆరోపించగా అయన సినిమా రిలీజ్ అయ్యాక ఆరోపించడంతో ఆయన ఎంత ఆవేదన చెందినా అర్థం లేకుండా పోయింది..
ఇక పుష్ప విషయంలో అయన మాత్రం ముందుగానే స్పందించడంతో ఇప్పుడు తలలు పట్టుకోవడం దర్శక నిర్మాతల వంతు అయ్యింది. ఇప్పటికే మహేష్ సినిమా రిజెక్షన్ తో ఢీలా పడిపోయిన సుకుమార్ ను బన్నీ ఛాన్స్ ఇచ్చి పైకి లేపితే ఇప్పుడు ఈ స్టోరీ తనది అంటూ ఈ రచయిత రావడం సుకుమార్ కి లేని తలనొప్పిగా మారింది.. మరి ఈ ఇష్యూ ను సుకుమార్ ఏవిధంగా సాల్వ్ చేస్తాడో చూడాలి..