Wednesday, May 15, 2024
- Advertisement -

రాజమౌళికి తలనొప్పిగా మారారు!

- Advertisement -

బాహుబలి సినిమా రిలీజ్ అయ్యాక పార్ట్-2 షూటింగ్ కోసం చాలా టైం ఉండటంతో రానా, తమన్న, అనుష్క, రమ్యకృష్ణ లాంటి నటులకు వేరే సినిమాలు చేసుకోమని  జక్కన్న చెప్పాడు. అప్పట్లో ఇదే విషయంపై విమర్శలు కూడా చెలరేగాయి.

ప్రభాస్ ను కావాలనే కట్టిపడేసి,మిగతా వాళ్లకు వెసుసుబాటు ఇవ్వడం ఏంటంటూ రాజమౌళికి చాలానే విమర్శలు వచ్చాయి. అయితే ఆ విమర్శల్ని జక్కన్న అప్పట్లో పట్టించుకోలేదు. కానీ అప్పుడు తను చేసిన పనికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నాడట. ఎవరికైతే మిగతా షూటింగుల్లో పాల్గొనమని వెసులుబాటు ఇచ్చాడో వాళ్లంతా ఇప్పుడు రాజమౌళికి తలనొప్పిగా మారారని తెలుస్తోంది.

బాహుబలి పార్ట్-2కు సంబంధించి భారీ షెడ్యూల్ ఖరారుచేశాడు రాజమౌళి. ఈనెల 13 నుంచి ఏకథాటిగా 10వారాల పాటు క్లయిమాక్స్ సన్నివేశాల్ని షూట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. క్లయిమాక్స్ అంటే అందులో సన్నివేశాల కంటే యుద్ధాలే ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి భారీ కసరత్తు అవసరం. ముందుగానే ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. బాహుబలి పార్ట్-1కు యూనిట్ సభ్యులంతా అదే చేశారు.కానీ పార్ట్-2కు వచ్చేసరికి మాత్రం చాలా మంది హ్యాండ్ ఇస్తున్నారట. అబినేత్రి ఉందని తమన్నా… భాగమతి ఉందని అనుష్క, ఘని సినిమా ఉందని రానా తప్పించుకుంటున్నారట. దీంతో ఒక్కోసారి ప్రబాస్ ఒక్కడే ఒంటరిగా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడట. షూటింగ్ కు పట్టుమని 10 రోజులు కూడా లేని ఇలాంటి టైమ్ లో నటీనటుుల ఇలా హ్యాండ్ ఇవ్వడంపై రాజమౌళి చాలా కోపంతో ఉన్నట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -