శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గోపిచంద్ కెరీర్లో ఇది 32వ సినిమా కాగా రీసెంట్గా సినిమా షూటింగ్ ఇటలీలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.అటు మాస్ని ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పించే శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్కి సంబంధించి ఆసక్తికర వార్త టీ టౌన్లో చక్కర్లు కొడుతోంది.
కథా నేపథ్యం పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. మొత్తంగా కథ మొత్తం నీటి చుట్టే తిరుగుతుందని ప్రచారం జరుగుతుండగా కామెడీతో పాటు ఫుల్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా సినిమాను తెరకెక్కించనున్నారట. ఈన్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారగా అలాగే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలాతో ఓ ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట.
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్పై నిర్మిస్తుడగా గోపీ మోహన్ స్క్రీన్ప్లే, కెవి గుహన్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.