Saturday, April 27, 2024
- Advertisement -

అనసూయ, సుమలకు ఊహించని షాక్..!

- Advertisement -

సినిమా వాళ్లు జీఎస్టీ అధికారులు వరుస దాడులతో టెన్షన్ పెడుతున్నారు. దీంతో స్టార్స్ కి కొత్తగా జీఎస్టీ పంచ్ ఒణుకు పుట్టిస్తోంది. తాజాగా ముగ్గురు సెలబ్రిటీలపై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించడంతో టాలీవుడ్ వర్గాల్లో మరోసారి ఒణుకు మొదలైంది.

అందాల రాక్షసీ లావణ్య త్రిపాఠి జీఎస్టీ అధికారులు శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దర్శకుడు జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ దాడుల్ని నిర్వహించారు. లావణ్యతో పాటు జబర్దస్త్ యాంకర్ అనసూయ.. అలానే సీనియర్ యాంకర్ సుమ ఇళ్లలోనూ జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని కంపెనీల్లో సుమ.. అనసూయ పెట్టుబడులు పెట్టారని అధికారుల ఆరాల్లో తేలిందట.

ఆ సంస్థలకు సంబంధించి సర్వీస్ ట్యాక్స్.. జీఎస్టీ ట్యాక్స్ ని ఎగ్గొట్టారని.. అది పెద్ద మొత్తంలో వుందని వార్తలు షికారు చేస్తున్నాయి. ఆ కారణంగానే వీరి ఇళ్ళపై జీఎస్టీ ఇంటలిజెన్స్ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. చిట్ ఫండ్ కంపెనీలు.. కోల్డ్ స్టోరేజీలు.. సాఫ్ట్ వేర్ కంపెనీలు.. కన్ స్ట్రక్షన్ కంపెనీలతో పాటు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ లోనూ వీరు పెట్టుబడులు పెట్టినా సకాలంలో పన్ను చెల్లించలేదని.. జీఎస్టీ ఎగవేసారని అందుకే ఈ దాడులు నిర్వహించారని ప్రచారం సాగుతోంది. మరి దీనిపై ఈ యాంకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -