తనకు సినీ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడి తర్వాతి సినిమాలో నటించమని కోరగా ఆ హీరోయిన్ నో చెప్పేసింది. ఆ మాట ఆ నోట ఈ నోట వస్తూ చివరికి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘కుమారి 21 ఎఫ్’. ఈ సినిమాతో రాజ్ తరుణ్తో కలిసి నటించిన హీరోయిన్ హెబ్బా పటేల్. కుర్రకారును ఆకట్టుకున్న ఈ భామ ఆ తర్వాత రాజ్తరుణ్తోనే మరో రెండు సినిమాలు చేసింది. అయితే మొదటి సినిమా అంతా హిట్ కాలేదు.
ఆ తర్వాత పలు సినిమాలు చేసిన హెబ్బాకు అంత కలిసిరాలేదు. దీంతో సినిమాలు చేయడం తగ్గించేసింది. అయితే ఇటీవల సుకుమార్ హెబ్బాను తన సినిమా కోసం అడిగితే మాత్రం వద్దని ఖరాఖండిగా చెప్పేసింది. ప్రస్తుతం సుకుమార్ రామ్చరణ్, సమంతతో కలిసి ‘రంగస్థలం’ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ సినిమాలో అనసూయ పాత్ర కీలకంగా ఉండనుందని సమాచారం.
అయితే ఆ పాత్రలో హిబ్బా పటేల్నే మొదట అడిగారట. హిబ్బా పటేల్ చేయాల్సిన పాత్రను అనసూయకు దక్కింది. చిన్న పాత్ర కావడంతో హెబ్బా పటేల్ సుకుమార్ ఆఫర్ను నో చెప్పిందట. కొంచెం ఫీల్ అయినా సుక్కు ఆ పాత్ర అనసూయ కూడా బాగానే ఉంటుంది అనిపించి తనని తీసుకున్నాడు.
సినిమాలు లేని సమయంలో మంచి ఆఫర్ వస్తే తిరస్కరించిన హిబ్బా పటేల్ను ఏమనాలో తెలియదు. ఇప్పుడు ‘రంగస్థలం’ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. ఈ సినిమా కనుక హిబ్బా చేసి ఉంటే టాలీవుడ్లో బోలెడు ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ‘రంగస్థలం’ సినిమా మార్చి 30వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది.