Sunday, May 12, 2024
- Advertisement -

దసరాకు ఎవ‌రు పైచేయి సాధిస్తారో!

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎనర్జిటిక్ హీరో రామ్ బాక్స్ ఆఫీస్ వద్ద వార్‍కు రెడి అవుతున్నారు. రామ్ చరణ్ కు టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ తో పాటు మంచి పాలోయింగ్ ఉంది. రామ్ చరణ్ అంత కాకుంన్న రామ్‍కు కూడా మంచి పాలోయింగే ఉంది. అయితే ఈ సారి రామ్ డైరెక్ట్ గా చెర్రీతో హైట్‍కు రెడి అవుతున్నాడు.

వరస ప్లాపులు చూసిన రామ్ కు నేను శైలజ రూపంలో మంచి విజయం దక్కింది. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ యేడాది జ‌న‌వ‌రి 1న విడుదల అయిన నేను..శైలజ రామ్ కేరీర్ లోనే హయ్యస్ట్ షేర్ రాబట్టింది.

ఈ సినిమా త‌ర్వాత ఐదు నెల‌లు గ్యాప్ తీసుకున్న రామ్ గతంలో తనకు ‘కందిరీగ’ వంటి హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం మరోసారి నటిస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్ టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దసరాకు ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే దసరా టార్గెట్‌గా అక్టోబర్‌లో రామ్ సినిమాను రిలీజ్ చేయాలంటే.. ఖచ్చితంగా రామ్ చరణ్‌తో పోటీకి సిద్ధం కావాల్సిందే.

రెండు వ‌రుస ప్లాపుల త‌ర్వాత చెర్రీ న‌టిస్తున్న ‘ధ్రువ’ కూడా దసరా కానుకగానే విడుదల కాబోతోంది. “కందిరీగ” దర్శకుడి కథపై నమ్మకంతో రామ్ చరణ్ వంటి స్టార్ హీరోను ఢీ కొట్టేందుకు సై అంటున్నాడు రామ్. మ‌రి ఈ ఇద్ద‌రు యంగ్ హీరోల‌లో ఎవ‌రు త‌మ సినిమాతో పైచేయి సాధిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -