Tuesday, May 21, 2024
- Advertisement -

నాగ్‌తో మ‌రోసారి

- Advertisement -

అనుష్క న్యూస్ ఎప్పుడూ హ‌టే. ఆమే గురించి నిరంత‌రం సోష‌ల్ మిడియాలో ఏదో ఒక వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తుంటుంది.ఇప్పుడు కూడా అలాంటి వార్తే ఒక‌టి వైర‌ల్ అవుతుంది.నాగ్ -వ‌ర్మ‌ లేటెస్ట్ మూవీ ప్రారంభమైంది. రాజుగారి గది2 తర్వాత రెండు నెలలకు పైగా గ్యాప్ తీసుకున్న నాగ్..కొత్త సినిమా స్టార్ట్ చేసేశారు. ఈ చిత్రంలో నాగార్జున తొలిసారిగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించనున్నారనే విషయాన్ని ఇప్పటికే రివీల్ చేసేశారు కూడా.రాంగోపాల్ వర్మ దర్శకత్వం.

ఇందులో విశేషం ఏమిటంటే ఇందులో హిరొయిన్‌గా అనుష్క‌ని తీసుకున్నార‌ని స‌మాచ‌రం.ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు.నాగ్ తో హిట్ పెయిర్ గా గుర్తింపు పొందిన టబును హీరోయిన్ గా తీసుకుంటారని తొలుత టాక్ వచ్చింది. కానీ ఈ విషయాన్ని దర్శకుడు వర్మ ఖండించేశాడు. టాలీవుడ్ లో వినిపిస్తున్న మాటల ప్రకారం.. టాప్ బ్యూటీ అనుష్కను నాగార్జునకు జోడీగా ఎంపిక చేశారట.రిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అనేక చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి.

బాహుబ‌లి -2 త‌ర‌వాత అనుష్క చేతిలో సినిమాలు ఏమి లేవు.భాగ‌మ‌తి సినిమా కుడా బాహుబ‌లి ముందు అంగీక‌రించిందే కావ‌డంతో ఆమే చేతిలో సినిమాలు లేవ‌ని చేప్పాలి.ఈ మ‌ధ్య బాలీవుడ్ సినిమా అవ‌కాశం వ‌చ్చింద‌నే వార్త హ‌ల్‌చ‌ల్ చేసింది.కానీ అది రుమ‌ర్ మాత్ర‌మే అని తేలింది.క‌ష్టాల‌లో ఉన్నా అనుష్కని నాగ్ ఈ సినిమాతో అదుకున్నార‌ని స‌మాచ‌రం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -