Wednesday, May 8, 2024
- Advertisement -

అమ్మాయిగా మారిన తర్వాతే జబర్దస్త్ సాయి ఇలా ..!

- Advertisement -

జబర్దస్త్ సాయి ప్రియాంక అంటే చాలా మంది గుర్తుపట్టారు. కానీ జబర్దస్త్ సాయి తేజ అంటే వెంటనే గుర్తుపడతారు. అయితే సాయితేజే అలియాస్ సాయి ప్రియాంక (పింకీ) పూర్తిగా అమ్మాయిగా మారిన తర్వాత సాయి తన పేరును ప్రియాంకగా మార్చుకున్నాడు. దాదాపు ఏడాది పాటు షూటింగ్ లకు దూరంగా ఉన్న ప్రియాంక.. మళ్లీ తన షూటింగ్ లతో బిజీ కాబోతుంది.

జబర్దస్త్ బ్యాచ్‌తో సందడి చేస్తోంది. జబర్దస్త్ షోకు పోటీగా జీ తెలుగులో ‘అదిరింది’ షో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షోకు యాంకర్‌గా రవి, జడ్జిగా నాగబాబు వ్యవహరిస్తున్నారు. ఈ కామెడీ షోలో .. జబర్దస్త్ కామెడీలో పనిచేసిన టీమ్ లీడర్స్‌నే తీసుకున్నారు. ధన్ రాజ్, వేణు, ఆర్పీ, చంద్ర.. ప్రస్తుతానికి ఈ నలుగురూ ‘అదిరింది’ షోలో టీమ్ లీడర్స్‌గా ఉన్నారు.

ఇప్పటికే ఈ స్కిట్స్ కు సంబంధించి రిహార్సల్స్ కూడా మొదలు పెట్టారు. అందులో నరేష్, నెమలి రాజు, తన్మయ్, కొమరం సహా చాలా మంది జబర్దస్త్ నటులు ఈ షోలో కనిపించబోతున్నారు. వీరితోపాటు సాయి పింకీ కూడా ‘అదిరింది’లో నటిస్తోంది. ఆ విషయాన్ని స్వయంగా ఆమెనే టిక్ టాక్ ద్వారా చెప్పింది. జబర్దస్త్ లో చాలా స్కిట్స్ చేసిన సాయితేజ.. ప్రస్తుతం ఆ షోకి దూరంగా ఉంది.

లేడీ గెటప్స్‌తో పాపులరైన సాయితేజ.. ఆ తర్వాత నిజంగానే అమ్మాయిగా మారిపోయాడు. జెండర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేయించుకొని యువతిగా మారాడు. బుల్లి తెరపై అవకాశాల కోసం ప్రయత్నిస్తునే.. సినిమాల్లో కూడా ట్రై చేస్తుంది. ఇక జీ తెలుగులో గుండమ్మ కథ సీరియల్‌లో కూడా నటిస్తోంది.

https://www.tiktok.com/@saitejajaberdasth

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -