Saturday, April 27, 2024
- Advertisement -

ప్రభాస్‌తో వార్..కళ్యాణ్ రామ్ తప్పు చేస్తున్నాడా?

- Advertisement -

బింబిసారతో తన కెరీర్‌లోనే ఆల్ టైం హిట్‌ని కొట్టాడు. అయితే తర్వాత వచ్చిన అమిగోస్‌తో బిగ్గెస్ట్ ఫ్లాప్‌ని మూట గట్టుకోగా ప్రస్తుతం సరికొత్త కథ డెవిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, పాటలు అన్ని ప్రేక్షకులను ఆకట్టుకోగా తాజాగా రిలీజ్ డేట్‌ని లాక్ చేశారు మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 29న డెవిల్‌ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

అయితే ఇక్కడే కళ్యాణ్ రామ్ రిస్క్ చేస్తున్నాడనిపిస్తోంది. ఎందుకంటే డిసెంబర్ 21న షారుఖ్ నటించిన డంకీ, డిసెంబర్ 22న ప్రభాస్ సలార్ రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలు రిలీజైన వారం రోజుల్లోనే డెవిల్ వస్తోంది. అయితే వాస్తవానికి సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తోంది.

ఇక అగ్రహీరోల సినిమాలు రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే ఖచ్చితంగా రెండు వారాల పాటు బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయం. అలాంటిది ఇద్దరు అగ్రహీరోల సినిమాలు డంకీ, సలార్ వస్తుండగా ఈ రెండు హిట్ అయితే కళ్యాణ్ రామ్‌కు థియేటర్లు దొరకడం కష్టమే. అందుకే కళ్యాణ్ రామ్ రిస్క్ చేస్తున్నారా అనే టాక్ నడుస్తోంది. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ పై నిర్మాత అభిషేక్ నామ తన దర్శకత్వంలోనే తెరకెక్కించగా కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -