సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఇద్దరి హీరోలకు టాలీవుడ్లో ఓ రెంజ్లో పాలోయింగ్ ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాతో బీజీగా ఉన్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ సినిమాని సమ్మర్ కానుకగా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు.
అలాగే అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం సరైనోడు సినిమాతో బిజీగా ఉన్నాడు. బొయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ సినిమాని కూడా సమ్మర్కే రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు కోలీవుడు టాప్ డైరెక్టర్స్తో చేయడానికి ముందుకు వస్తున్నారు. మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా తర్వాత కోలివుడు టాప్ డైరెక్టర్ మురగదాస్ దర్శత్వంలో చేయనున్నాడు. అలాగే అల్లు అర్జున్ కూడా సరైనోడు తర్వాత కోలీవుడు టాప్ డైరెక్టర్స్తో తన తదుపరి సినిమాలు చేయనున్నాడు.
కోలీవుడు డైరెక్టర్ లింగు స్వామికి తెలుగులో మంచి పేరు వుంది. అయన దర్శకత్వంలో వచ్చిన పందెం కోడి, అవారా సినిమాలు తెలుగులో కూడా హిట్ అయ్యాయి. ఐతే ఈ దర్శకుడితో బన్నీ ఓ సినిమా చేయబోతున్నాడు అని తెలుస్తుంది. సరైనోడు తర్వాత బన్నీ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసేందుకు అంగీకరించాడు. ఈ సినిమా తర్వాత లింగు స్వామితో చేసే అవకాశం ఉంది. మరి కోలివుడు టాప్ డైరెక్టర్స్ మన టాలీవుడు టాప్ హీరోస్కి ఎలాంటి హిట్స్ ఇస్తారో చూడాలి మరి.