Monday, April 29, 2024
- Advertisement -

గుంటూరు కారంను తమన్ లైట్ తీసుకున్నాడా?

- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్స్ నటిస్తుండగా త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్ర ఇది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందని తెలుస్తోండగా హారిక & హాసిని క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

సినిమా రిలీజ్‌కు టైం దగ్గర పడుతున్న తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేయగా అవి అభిమానులను నిరాశపర్చాయి. ముఖ్యంగా ఫస్ట్ సాంగ్‌తో పోలీస్తే సెకండ్ సాంగ్‌కు అంత స్పందన రాలేదు.

దీంతో మహేష్ ఫ్యాన్స్ తమన్‌ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ పాట మహేష్ బాబు రేంజ్ తగ్గ సాంగ్ కాదని మండిపడుతున్నారు. సాంగ్ చాలా రొటీన్ గా ఉందని, మీడియం రేంజ్ హీరోల సాంగ్ మాదిరి ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సర్కారు వారి పాట సినిమాకు తమన్ ఇలానే చేశారని, ఇప్పుడు గుంటూరు కారం సినిమాకు సరిగ్గా మ్యూజిక్ ఇవ్వడం లేదని మండిపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -