బాలయ్య హోస్ట్గా ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న షో అన్స్టాపబుల్. ఇప్పటికే ఈ షోకి చాలామంది అతిథులు రాగా ఇండస్ట్రీలో మరో క్రేజీ న్యూస్ వైల్గా మారింది. మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా ప్రమోషన్స్లో భాగంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ దమ్ మసాలా సాంగ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ప్రమోషన్స్లో భాగంగా బాలయ్య అన్స్టాపబుల్ షోకి గుంటూరు కారం టీం హాజరుకానుందట. ఓ స్పెషల్ ఎపిసోడ్ను మహేష్ బాబు, త్రివిక్రమ్తో ప్లాన్ చేశారని తెలుస్తోంది.గతంలో బాలయ్య షోకి హాజరయ్యారు మహేష్. ఆ ఎపిసోడ్కు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా గుంటూరు కారం స్పెషల్ ఎపిసోడ్ అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ మూవీ ఏపీ, తెలంగాణా థియేట్రికల్ రైట్స్కు దాదాపుగా 120 కోట్లకు అమ్ముడుకాగా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 155 కోట్లకు చేరుకుంటుందని టాక్. సునీల్, అజయ్ కీలక పాత్రల్లో కనిపించనుండగా దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కుతోంది.