Wednesday, May 15, 2024
- Advertisement -

మురుగదాస్ మీద పిచ్చ కోపంగా ఉన్న మహేష్ ఫాన్స్ ?

- Advertisement -

మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా సినిమా అంటే మహేష్ ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఒస్తున్న ఒక వార్త వారిని కలత పరిచే విధంగా కనిపిస్తోంది. విశ్వసనీయ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం మురుగదాస్ – విజయ్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘తుపాకీ’ సినిమా కి సీక్వెల్ ని మురుగదాస్ మహేష్ తో రీమేక్ చేస్తున్నాడు అని చెబుతున్నారు.

సుమారు రూ: 85కోట్ల వ్యయంతో ఆ చిత్రం తీయబోతున్నట్టు తెలిసింది. విజయ్ కథానాయకుడిగా నటించిన తుపాకి తెలుగు – తమిళ భాషల్లో భారీ విజయాన్ని నమోదు చేసింది. దాన్ని తెలుగులో మహేష్ తో రీమేక్ చేద్దాం అని చూసారు కానీ మహేష్ ఒప్పుకోలేదు, సో డైరెక్ట్  గా విడుదల చేసారు హిందీ లో అక్షయ్ కుమార్ రీమేక్ చేసాడు. 

తుపాకీ సీక్వెల్ అంటూ వస్తున్న వార్తల మీద మహేష్ ఫాన్స్ సీరియస్ గా ఉన్నారు. సీక్వెల్స్ తెలుగు లో హిట్ అయ్యే చాన్స్ లేదని, పైగా విజయ్ తో మొదటి భాగం తీసి రెండవ భాగం మహేష్ తో ఎలా తీస్తారు అని మహేష్ ఫాన్స్ కోప్పడుతున్నారు. మురుగదాస్ ప్రస్తుతం హిందీలో అకీరా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మహేష్ బాబు బ్రహ్మోత్సవంలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.  అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -