దర్శకధీరుడు రాజమౌళి తన తర్వాతి ప్రాజెక్టును సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు అనౌన్స్ అయి దాదాపు సంవత్సరం గడుస్తున్న ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగస్టులో పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా చేస్తుండగా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత హాలీ డే ట్రిప్కు వెళ్లి వచ్చిన తర్వాత రాజమళి సినిమాక డేట్స్ ఇవ్వనున్నారట మహేష్.
ఇక జక్కన్న సినిమాతో బాలీవుడ్లో అడగుపెట్టబోతున్నారు మహేష్. ఓ సోషియోఫాంటసీ కథతో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించనుండగా మహేష్ సరసన దీపికా పదుకొణే హీరోయిన్గా నటించనుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ విషయమై తన తండ్రి విజయేంద్ర ప్రసాద్తో డిస్కషన్స్ పూర్తి చేసి ఒక రూపు తీసుకొచ్చారని సమాచారం. కమల్ హాసన్ కూడా ఒక ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది.