చిదంబరం పొదువల్ దర్శకత్వంలో సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’. మలయాళంలోనే 200 కోట్లకు పైగా గ్రాస్తో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఏప్రిల్ 6న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కాగా తెలుగులోనూ సత్తాచాటింది.
నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోటా సక్సెస్ సాధించింది. తెలుగు సహా మళయాళ తమిళ్ ఆడియెన్స్ కి కూడా విపరీతంగా నచ్చింది. తాజాగా ఇవాళ ఓటీటీలో ప్రేక్షకుల ముందుకురాగా అదిరే రెస్పాన్స్ వస్తోంది.
ఓటీటీలో బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకోగా రికార్డు వ్యూస్ను రాబడుతోంది. తెలుగు వెర్షన్ను నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పించగా ఓటిటిలో చూసిన వీక్షకులు దాదాపు యూనానిమస్ గా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ నే సోషల్ మీడియాలో అందిస్తున్నారు.