Friday, May 17, 2024
- Advertisement -

హీరో రాజశేఖర్ నిద్రమాత్రలు తీసుకొని… కార్ ఆక్సిడెంట్..

- Advertisement -

అర్ధరాత్రి కారుతో రోడుపైకి హీరో రాజశేఖర్ ఎందుకు వచ్చారు..? ఆయన కారు ప్రమాదానికి కావడం వెనుక కారణం ఏంటి..? ఫ్యామిలీతో గొడవ కావడం వల్ల మనస్తాపం చెందిన ఆయన.. ఆ నెపథ్యంలో నిద్రమాత్రలు తీసుకొన్నారని తెలుస్తోంది. రాజశేఖర్‌ నడుపుతున్న కారు ఆదివారం అర్ధరాత్రి శివరాంపల్లి పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే 240 పిల్లర్‌ వద్ద ప్రమాదానికి గురైంది. ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో కారుని డీ కొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయలు కాకపోవడంతో అంతా ఊపురి పీల్చుకున్నారు.

‘‘చనిపోయిన తల్లి మళ్లీ రాదు.. ఇలా ఎన్ని రోజులు డల్‌గా ఉంటావు’’ అంటూ కుటుంబ సభ్యులు ఆయను ప్రశ్నించారు. అలా మాటమాట పెరగడంతో స్వల్ప వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన రాజశేఖర్‌ కారు (ఏపీ 13ఈ1234 నంబరు)తో బంజారాహిల్స్‌లోని తన ఇంటి నుంచి బయటికి వచ్చారు. ఆదివారం అర్ధరాత్రి శంషాబాద్‌ నుంచి మెహిదీపట్నంవైపు పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే పైనుంచి వస్తున్నారు. శివరాంపల్లి పిల్లర్‌ నంబరు 240 వద్ద కారు ఆపి సిగరెట్‌ తాగారు. అనంతరం కారును తీశారు. తన కారును ఓవర్‌టేక్‌ చేయబోతున్న అత్తాపూర్‌ నివాసి రాంరెడ్డి కారును ఢీకొట్టారు. రాంరెడ్డి ఆ కారును ఆపి ప్రశ్నించారు. అప్పటికే మత్తులో ఉన్న రాజశేఖర్‌ పొంతనలేని జవాబు చెప్పారు.

రాంరెడ్డి వెంటనే డయల్‌ 100కి ఫోన్‌ చేసి, రాజేంద్రనగర్‌ ఠాణాలోనూ ఫిర్యాదు చేశారు. పోలీసులు రాజశేఖర్‌, రాంరెడ్డికి డ్రంకన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించారు. రాజశేఖర్‌కు బ్లడ్‌ ఆల్కహల్‌ కంటెంట్‌ 20 ఎంఎల్‌ చూపించింది. విషయం తెలిసిన రాజశేఖర్‌ భార్య జీవిత పీఎస్‌కు వచ్చారు. డిప్రెషన్‌లో ఉండటం వల్లే రాజశేఖర్‌ అలా చేశారని రాంరెడ్డికి చెప్పారు. దీంతో ఇరువురూ రాజీకి రావడంతో రాజశేఖర్‌ను పోలీసులు వదిలేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -