Friday, May 17, 2024
- Advertisement -

నాగబాబు ని నమ్మిన వారే మోసం చేశారట

- Advertisement -

ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇటర్వ్యూలో నాగబాబు తన రియల్ లైఫ్ లో ఎదురుకున్న కొన్ని విషయాలను తెలియజేశారు. నాగబాబు గత కాలంగా సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నారని చెప్పుకోవాలి. సినిమాల్లో ప్రధాన్యం ఉన్న పాత్రలు చిన్నవి అయిన చేస్తున్న నాగబాబు.. బుల్లితెర మీద సీరియల్ చేస్తూ.. అలానే జబర్ధస్త్ అనే షోకి జడ్జ్ గా చేస్తున్నారు. తన జీవితంలో ఒక సినిమా వల్ల బాగా దెబ్బతిన్నానని తెలిపారు.

చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాకి నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాతో కోలుకోలేని దెబ్బతిన్నానని చెప్పారు… ఈ సినిమాలో నమ్మిన వాళ్లే మోసం చేశారు అని చెప్పారు.. అసలు ఈ మూవీ ద్వారా లాస్ అయినదాని కంటే.. వెనుక ఉండి వెన్నుపోటు పొడవటం అతి భయంకరమని చెప్పారు. ఈ మోసం వల్ల తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఒకే ఒక్క నైట్ లో పోయిందని వివరించారు… తన ఆస్తులు అమ్మిన కూడా తీర్చలేని అప్పులు అయిపోయాయని చెప్పుకొచ్చారు.. .. ఆ టైం లో పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి అంత నేను చూసుకుంటానని ఊరట ఇచ్చారని చెప్పారు.

ఆ తర్వాత చిరంజీవి కూడా తన పక్షాన నిలబడ్డారని లేకపోతే ఆ మానసిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వెళ్లానని తెలిపారు. ఈ విషయంలో అన్నయ్య చిరంజీవి, పవన్ కళ్యాణ్ నాకు అండగా నిలబడ్డారని తెలిపాడు. వాళ్లు లేకుంటే.. తనకు జీవితమే ఉండేది కాదని.. అన్నారు.

https://www.youtube.com/watch?v=6X7IhPnlD6k

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -