Friday, May 10, 2024
- Advertisement -

సాయి పల్లవి అంటే నాగబాబు ఎందుకు కోపడుతున్నాడు

- Advertisement -

ఫిదా ఎలాంటి విజయం సాదించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ద్వారా యూనిట్ కి మొత్తంకు అద్భుతమైన పేరు వచ్చింది. ప్రధానంగా హీరోయిన్.. సింగిల్ ఫిస్ భానుమతిగా అల్లాడించేసిన సాయిపల్లవి.. ఈ సినిమాకి ప్రాణం పోసింది. సాయి పల్లవి గురించి మాట్లాడుకోని ఇళ్లు లేదు ఇప్పుడు. మూవీ చూసిన ప్రతి ఒక్కరు సాయిపల్లవిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. అయితే తేజ్ తండ్రి నాగబాబు మాత్రం సాయిపల్లవి పేరు ఎత్తితే మండిపడుతున్నాడంట. ఎవరు చూసినా సాయిపల్లవిని ఆకాశానికి ఎత్తేయడం, వరుణ్ తేజ్ ని పట్టించుకోకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

అంతేకాదు సాయిపల్లవిలా మరొకరు ఎవ్వరూ చేయలేరు. వరుణ్ తేజ్ బదులు నానీని పెడితే ఇంకా బాగా చేసేవాడు అనే కామెంట్లు వినిపించడంతో.. నాగబాబు రగిలిపోతున్నాడట. సాయిపల్లవి సూపర్ యాక్షన్ వల్లే వరుణ్ తేజ్ ను పక్కన పెట్టేశారు. ఆమెని మీడియా కూడా అక్కరలేని దానికన్నా ఎక్కువగా ఆకాశానికి ఎత్తేస్తుందని ఉక్రోషం వెళ్లగక్కాడట మెగా బ్రదర్. అంతేకాదు సాయిపల్లవిని సోలో ఇంటర్వ్యూలకు పంపవద్దని.. ఆమెని ఒక్కరినే ఆకాశానికెత్తేస్తూ సింగిల్ ఇంటర్వ్యూలు చేయించవద్దని నిర్మాత దిల్ రాజుని, డైరెక్టర్ శేఖర్ కమ్ములని కోరాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -