Friday, May 17, 2024
- Advertisement -

షాకింగ్ : తెలుగు దేశం పేరు మారుస్తున్నారు ?

- Advertisement -

తెలంగాణా లో ఇప్పుడు టీడీపీ కి మనుగడ ప్రశ్నార్ధకం గా మారింది. నిజానికి ప్రశ్నార్ధకం కాదు అనీ మనుగడే లేదు అనీ టీడీపీ జనాలే ఒప్పుకుంటున్నారు. తెలుగు దేశం పార్టీ ఇప్పుడు అన్నీ ఒదిలేసి ఇప్పుడు వాస్తు మీద నమ్మకాలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

పార్టీ కార్యాలయం గోడలు దగ్గర నుంచీ , గేట్ ల దగ్గర నుంచీ అన్నీ మార్పులు చేస్తున్న టీడీపీ జనాలు ఇప్పుడు పార్టీ పేరు కూడా మారుద్దాం అనుకుంటున్నారట. ఒక పక్క ఎలక్షన్ లలో దారుణంగా ఓడిపోతూ మరొక పక్క తెరాస పెట్టిన ఆపరేషన్ ఆకర్ష కి ఎమ్మెల్యే లని కోల్పోతున్న టీడీపీ ఇప్పుడు దొరికిన ఏ అవకాశాన్నీ ఒదులుకోవడం లేదు. 

ఈ విషయంలో వాస్తు పండితుల సహకారం తీసుకుంటూ భారీగా పేరు మార్పుల విషయం లో మల్లగుల్లాలు పడుతున్నారట. తెలంగాణా రాష్ట్రం లో తెలుగు దేశం అంటూ ఆంధ్రా పార్టీగా పేరు తెచ్చుకున్న తాము ఇక మీద అలా పిలిపించుకోకుండా టీ ఎస్ అనే పేరుతో పిలిపించుకోవాలని ఆలోచన చేస్తోందట.అయితే… టి.టిడిపి అనేది తెలుగుదేశం పార్టీ పెట్టుకున్న పేరు కాకపోవడం ఇక్కడ గమనార్హం.

సులభశైలిలో చెప్పుకునేందుకు అనుకూలంగా ఉండే పదాలను మీడియానే సొంతంగా వాడుతుంది. ఆ క్రమంలోనే రాష్ట్ర విభజన నేపధ్యంలో పార్టీలను ఎ.పి మరియు టి పదాలను చేర్చి వాడడం ప్రారంభించింది. ఇప్పుడు వాస్తు పేరుతో టి.టిడిపిని టిడిపి టి.ఎస్.గా మార్చి పిలవాలని స్వయంగా ఆ పార్టీ చెప్పుకున్నా రిపోర్టర్లు, మీడియా సంస్థలు బలంగా అనుకుంటే కానీ.. అలవాటు మారే ఛాన్సుంది. ఇదిలాఉంటే… ఈ తాజా నిర్ణయంపై కూడా కామెడీగా కౌంటర్లు వచ్చేస్తున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -