మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 పంక్షన్ కి పవన్ కళ్యాణ్ రాలేదు.. అయినప్పటికి కాటమరాయుడు వేడుకకి మెగాస్టార్ చిరు వస్తారని ఫ్యాన్స్ అనుకున్నారు. సర్దార్ సినిమా ఆడియో వేడుకకి చిరు వచ్చారు.. సో ఈ సారి తమ్ముడి నుంచి అన్నయ్యకు పిలుపు వెళుతుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ కాటమరాయుడు వేడుకకి సంబంధించి చిరుకి కానీ, ఇతర మెగా హీరోలకి కానీ ఇన్విటేషన్లు వెళ్లలేదట.
ఈ వేడుకలో కేవలం కాటమరాయుడు యూనిట్ కి సంబంధించిన వారు మాత్రమే వెళ్తారట. పవన్ సినీ పరిశ్రమకు వచ్చి ఇరవయ్యేళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వేడుక లో చిన్న సెలబ్రేషన్ వుంటుందట. ఈ విషయం కోసమైనా చిరుని పిలుస్తారని ఫ్యాన్స్ అనుకున్నారట. కానీ ఈ సారి అన్నయ్యని పిలవడానికి పవన్ ఎలాంటి అటెంప్ట్ చేసినట్టు లేడు.
ఇరవయ్యేళ్ల వేడుకని ఆర్భాటంగా చేయవద్దని, సింపుల్గా చేసేయమని పవన్ చెప్పాడట. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ ప్రాంగణంలో కాకుండా శిల్పకళావేదికలోనే ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొందరూ ఫ్యాన్స్ మాత్రం పవన్ సినిమా వేడుకకు చిరు ని పిలవకుండా అవమానిస్తున్నారని అంటున్నారు. సో ఏది ఏమైనా ఫ్యాన్స్ మాత్రం చిరుని, పవన్ ని ఒకే వేదికపై చూడాలని ఆశపడుతున్నారు.
{youtube}wPIGraosCpw{/youtube}
Related