Thursday, April 25, 2024
- Advertisement -

డ్రగ్స్ విషయంలో బిగ్ బాస్ షోకు నోటీసులు

- Advertisement -

టాలీవుడ్‌లో ఇప్పుడు డ్రగ్స్ మాఫియా పెద్ద కలకల రేపుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ డ్రగ్స్ దందాపై.. ఎవరికి నచ్చినట్లు వారు స్పందిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసిన.. ఈ డ్ర‌గ్స్ దందాపైనే చర్చించుకుంటున్నారు. ఇక ఈ డ్రగ్స్ పై మీడియాలో కూడా చాలా కథనాలు వస్తున్నాయి.

ఇక ఈ దందాపై సిట్ విచార‌ణ కూడా ఈ రోజు నుంచే ప్రారంభంకానుంది. బుధ‌వారం ముందుగా టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ విచార‌ణ‌కు హాజరుకానున్నారు. పూరి జ‌గ‌న్నాథ్‌తో ప్రారంభ‌మ‌య్యే విచార‌ణలో 20 న చార్మి, 21 న ముమైత్ ఖాన్, 22 న సుబ్బరాజు, 23 న కెమెరామెన్ శ్యాం కె నాయుడు, 24 న హీరో రవితేజ, 25 న ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, 26 న హీరో నవదీప్, 27 న తరుణ్, 28 న తనీష్,నందులను విచారించనుంది. వీరందరి ఇళ్లకు పోలీసులే స్వయంగా వెళ్లి నోటీసులు అందజేశారు. ఇక వీరిలో ఐటెం గ‌ర్ల్ మ‌మైత్‌ఖాన్ ప్రస్తుతం ఇక్కడ లేరు.

ఆమె తారక్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న బిగ్ బాస్ హౌస్‌లో ఉండటంతో సిట్ విచార‌ణ అధికారులు స్వ‌యంగా అక్క‌డికే వెళ్లి నోటీసులు అంద‌జేసేలా ప్లాన్ చేస్తున్న‌ట్టు సమాచారం. మ‌రి సిట్ అధికారులు బిగ్ బాస్ హౌస్‌కు వెళ్లి నోటీసులు అంద‌జేయాల్సి వ‌స్తే మ‌మైత్ షో నుంచి ముందుగానే బ‌య‌ట‌కు రావాల్సి ఉంటుంది. మరి ఇందుకు ఎన్టీఆర్ ఏమంటారో..? అసలు ఏం జరుగుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -