Sunday, May 19, 2024
- Advertisement -

మ‌రో ఇద్ద‌రు ద‌ర్శ‌కులు కావాలి!

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈయ‌న ఊ అంటే ఎంత పెద్ద ద‌ర్శ‌కుడైనా సినిమా చేయ‌డానికి ముందుకు వ‌చ్చేస్తాడు. కానీ ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఓ ద‌ర్శ‌కుడు కావాలి. విన‌డానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాకు ఓ ద‌ర్శ‌కుడు కావాలి. మ‌రో మూడేళ్ల‌లో రిటైర్మెంట్ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్.. నాలుగు సినిమాలు క‌మిట‌య్యాడు.

అందులో ఇద్ద‌రు ద‌ర్శ‌కులు క‌న్ఫర్మ్ అయ్యారు. ఒక‌టి ఎస్ జే సూర్య‌తో.. మ‌రోటి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో చేయాల‌ని ఫిక్స‌య్యాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. మ‌రో రెండు సినిమాలు మాత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రితో చేస్తాడ‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. దాస‌రి నారాయ‌ణ‌రావు నిర్మాణంలో ఓ సినిమా చేయాల్సి ఉంది ప‌వ‌ర్ స్టార్. ఈ సినిమాను ఎవ‌రు తెర‌కెక్కిస్తార‌నే ఆస‌క్తిక‌ర‌మే. గ‌తంలో ఇదే కాంబినేష‌న్ కోసం హ‌రీష్ శంక‌ర్, డాలి, సంప‌త్ నంది లాంటి ద‌ర్శ‌కుల పేర్లు వినిపించాయి. ఇక ఏఎం ర‌త్నంతోనూ ఓ సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ఈ సినిమా త‌మిళ్ బ్లాక్ బ‌స్ట‌ర్ వేదాలం సినిమాకు రీమేక్ అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ రీమేక్ ముచ్చ‌ట్లు త‌న‌వ‌ర‌కు వ‌చ్చినా.. దాన్ని ఇంకా క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేద‌ని చెప్పాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. అయితే క‌మిటైన సినిమాలు మాత్రం కచ్చితంగా పూర్తి చేస్తాన‌ని చెప్పాడు ప‌వ‌న్. ఈ లెక్క‌న ఇద్ద‌రు ద‌ర్శ‌కులు క‌న్ఫ‌ర్మ్ అయ్యారు.. మ‌రో ఇద్ద‌రు ద‌ర్శ‌కులు కావాలి. మ‌రి వాళ్లు హ‌రీష్ శంక‌రే అవుతాడా.. లేదంటే బాబీ అవుతాడో..? ఎవ‌రు అవుతారో చూడాలిక‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -