పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకేక్కుతున్న చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం పవన్ ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిపోగానే పవన్ బుల్లి తెరపై యాంకర్ గా రాబోతున్నాడు అని సినీ పరిశ్రమలో టాక్.
అవును ఇది నిజమే పవన్ యాంకర్గా ఓ షో చేయబోతున్నాడట. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేసిన సత్యమేవ జయత అనే ప్రోగ్రామ్కి దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. ఈ షో తెలుగులో కూడా డబ్బింగ్ చేశారు. ఇలాంటి ప్రోగ్రామే చేయబోతున్నాడు పవర్ స్టార్. టాలీవుడు మన్మధుడు నాగర్జున బుల్లితెరపై మీలో ఎవరు కోటిశ్వరుడు అనే ప్రోగ్రాం చేస్తున్నాడు.
ఈ ప్రోగ్రాం ప్రజల్లో మంచి పేరు సంపదించిది. అలాగే ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా హెచ్ఎమ్ టీవిలో వచ్చిన సత్యమేవ జయత కార్యక్రామానికి హోస్ట్ గా వ్యవహరించారు. ఏది ఎమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇలాంటి సామాజిక అంశంతో షో చేస్తే మాత్రం ప్రజలకు మరింత దగ్గరవుతాడు అని చెప్పవచ్చు. పవన్ బుల్లి తెరపైన కనబడితే ఆ ఛానెల్కి మాత్రం టిఆర్పి పండగే..