Sunday, May 19, 2024
- Advertisement -

పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో!

- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ ఎస్ జే సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై అప్పుడే అభిమానుల్లో భారీగా అంచనాలు ఏర్పడాయి. అయితే అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి శరత్ మారార్ నిర్మాత. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమాలో హీరోయిన్ పై కొన్ని వార్తలు వస్తున్న విషయం తెలింసింది.

మలయాళ భామ పార్వతీ మీనన్ ని తన తదుపరి చిత్రంలో హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . అయితే పార్వతీ మీనన్ మంచి నటి అయినప్పటికీ కమర్షియల్ గా పవన్ పక్కన సూట్ అవ్వదు అని అంటున్నారు ఈ వార్త విన్నవాళ్ళు. గతంలో కూడా సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో అనిషా అంబ్రోస్ ని హీరోయిన్ గా తీసుకోవడంతో ఫ్యాన్స్ నుండి మాత్రమే కాక చాలామంది నుండి వ్యతిరేకత రావడంతో తలొగ్గిన పవన్ ఆ భామ స్థానంలో కాజల్ అగర్వాల్ ని తీసుకున్నాడు.

ఆ సినిమా పరాజయం పొందడంతో వెంటనే మరో సినిమాకు రెడీ అయ్యాడు అయితే ఈ చిత్రంలో పార్వతీ మీనన్ ని హీరోయిన్ గా  తీసుకుంటున్నాడు అని తెలియగానే ఇప్పుడు కూడా వ్యతిరేకత వస్తోంది. పవన్ పక్కన జోడీ అంటే మాటలు కాదు కాబట్టి మరో హీరోయిన్ ని తీసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు. ఇప్పటి వరకైతే ఫైనల్ కాలేదు కానీ పార్వతీ మీనన్ మాట వినిపిస్తోంది. మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -