Wednesday, May 15, 2024
- Advertisement -

జై లవకుశ చూసి.. పవన్ ఏమన్నారంటే..?

- Advertisement -

ఎన్టీఆర్‌ మూడు పాత్రల్లో నటించిన ‘జైలవకుశ’ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. ఈ మూడు పాత్రలో ఒకటి విలన్ పాత్ర కావడంతో.. సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెంచుకున్నారు. అంచనాలను ఏమాత్రం తప్పకుండా దర్శకుడు బాబీ ఈ సినిమాను అద్బుతంగా తెరకెక్కించాడు.

సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు అంతా కూడా సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ చిత్ర దర్శకుడి గత చిత్రం ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’. ఈ మూవీ టైంలో బాబీపై పవన్‌కు అభిమానం మొదలైంది. మంచి ప్రతిభ ఉన్న దర్శకుడిగా పవన్‌ పదే పదే బాబీ గురించి అంటూ ఉండేవాడు. ఆ అభిమానంతోనే బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పవన్‌ మొదటి రోజే ప్రత్యేక షో వేయించుకుని మరీ చూసినట్లుగా సమాచారం అందుతుంది. పవన్‌ సన్నిహితులు చెబుతున్నదాని ప్రకారం సినిమా చూసిన తర్వాత పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా దర్శకుడు బాబీకి ఫోన్‌ చేసి సినిమా చాలా బాగుందని, మూడు పాత్రలను అద్బుతంగా మలిచి, కథను చక్కగా చూపించారు.

ఎన్టీఆర్‌ మంచి నటనతో మూడు పాత్రలకు కూడా న్యాయం చేశాడు అంటూ బాబీతో పవన్‌ అన్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు తన తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేయాల్సిందిగా పవన్‌ కళ్యాణ్‌ అన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా పలువురు స్టార్స్‌ కూడా సినిమాపై పాజిటివ్‌గా స్పందించారు. పవన్ లాంటి స్టార్ హీరో స్పందించడంతో దర్శకుడు బాబీ చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఇదో బ్లాక్‌ బస్టర్‌ సినిమాగా నిలిచిపోవడం ఖాయం అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -