Wednesday, May 15, 2024
- Advertisement -

వీరమ్ సినిమాని రీమేక్ చేయనున్నారు!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో సినిమాకి రెడి అవుతున్నాడు. ఖుషి లాంటి చిత్రాన్ని నిర్మించిన ఏ.ఎం.రత్నంతో కలిసి మరో సారి సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం పవన్ ఎస్ జే సూర్య తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి అవ్వాగానే రత్నంతో సినిమాకి రెడి కానున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన అజిత్ వీరమ్ సినిమా రీమేక్ రైట్స్ పోందడంలో పవన్ కు రత్నం చాలా పెద్ద హెల్పే చేసాడట.

అందుకు ప్రతి ఫలంగానే పవన్ కళ్యాణ్ తన తర్వాతి సినిమా ఆయనతో చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏ.ఎం.రత్నం పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమా కూడా తమిళ రీమేకే అని అంటున్నారు. అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘వేదాలమ్’ చిత్రాన్ని పవన్ తో రీమేక్ చేస్తే తెలుగులో మంచి సక్సెస్ అవుతుందని ఏ.ఎం.రత్నం భావిస్తున్నారు. ఈ మేరకు ఇద్దరూ ఒక అండర్ స్టాండిగుకు వచ్చినట్లు టాక్.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎస్.జె.సూర్య దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘వీరమ్’ రీమేకే అని టాక్. అయితే స్టోరీని మక్కికి మక్కి దించకుండా మార్పులు చేసినట్లు చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగిన విధంగా డైలాగ్స్ రాసారట. ఒకప్పుడు భారీ చిత్రాల నిర్మాతగా ఉన్న ఎ.ఎం.రత్నం తర్వాత కొన్ని సినిమాలు ప్లాపు కావడంతో చాలా నష్టపోయారు. దీంతో చాలా కాలం ఆయన సొనిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇటీవలే ఫైనాన్షియల్ గా కోలుకున్న ఆయన తమిళంలో మళ్లీ నిర్మాతగా రీఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -