ప్రభాస్ ను చూసి చిరంజీవి భయపడ్డట్లు ఫిల్మింనగర్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే దర్శకధీరుడు రాజమౌళి , ప్రభాస్ హీరోగా బాహుబలి, బాహుబలి కంక్లూజన్ తో రికార్డులు సృష్టిస్తున్నాడు.
ఇకపోతే చిరంజీవి 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి వహిస్తున్నాడు. అయితే వరుస హిట్లతో ప్రపంచ దేశాల్ని తెలుగు సినిమాని పరిచయం చేసిన రాజమౌళి ఉయ్యాలవాడకు దర్శకత్వం వహిస్తే బాగుంటుందని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడ్డారట. దీనిపై బాహుబలి సినిమా కోసం ప్రభాస్ మూడున్నరేళ్లు ఎదురు చూశాడు. ప్రభాస్ ఎదురు చూసినట్లు తాను ఎదురు చూడటం కష్టమని భయపడ్డ చిరంజీవి సురేందర్ రెడ్డితో కమిట్ అయినట్లు ఓ రూమర్ క్రియేట్ అయ్యింది.
ఈ రూమర్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారట. టైమింగ్ లో చిరూ చేయలేని త్యాగం ప్రభాస్ చేశాడని గుసగుసలాడుతున్నారు.