శర్వానంద్ హీరోగా ‘ఎక్స్ ప్రెస్ రాజా ‘ అనే సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మేర్ల పాక గాంధి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నిన్న హైదరాబాద్ లో ఆడియో విడుదల చేసారు.
ఈ ఆడియో వేడుకకు చీఫ్ గెస్ట్ లుగా హీరో ప్రభాస్ , దిల్ రాజు లు వచ్చారు. ఈ సినిమాని యు . వి క్రియేషన్స్ బ్యానర్ ఫై వంశీ,ప్రమోద్ లు నిర్మింస్తున్నారు. అయితే ఈ యు . వి క్రియేషన్స్ బ్యానర్ ను వెనుకనుండి నడిపించేది ప్రభాస్ అని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఐతే ఈ ఆడియో వేడుకకు గెస్ట్ గా వచ్చిన దిల్ రాజు ప్రభాస్ ఫై సంచలన వాఖ్యలు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ లో పెద్ద హాట్ టాపిక్ గా మారాయి. ఈ యు వి క్రియేషన్స్ సంస్థకి ప్రభాస్ బినామి , హీరో ప్రభాస్ దే ఈ సంస్థ అని దిల్ రాజు వాఖ్యానించారు.
మొత్తానికి ఈ విధంగా దిల్ రాజు యు . వి క్రియేషన్స్ బ్యానర్ హీరో ప్రభాస్ దే అని జనాల్లో ఉన్న కన్ప్యుజన్ కు ఓ క్లారిటీ ఇచ్చాడు.