బాబీ దర్శకత్వంలో నందమూరి బాలయ్య హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్లో సినిమా రిలీజ్ కానుండగా అస్సలు గ్యాప్ ఇవ్వకుండా షూట్ చేయాలని ఇటు బాలయ్య – అటు బాబీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇది బాలయ్య గత సినిమాలకు భిన్నంగా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్తో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో ఇద్దరు విలన్లు ఒకరు సంజయ్ దత్తో పాటు మరొకరు నటించే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా తొలుత త్రిషను అనుకున్న తాజాగా మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్తో యమదొంగ చిత్రంలో నటించిన ప్రియమణిని బాలయ్యకు జోడిగా తీసుకోనున్నారని తెలుస్తోంది.
ఈ కథకు ప్రియమణి అయితేనే సెట్ అవుతుందని భావించిన మేకర్స్ ఆమెను ఎంచుకున్నారని తెలుస్తోంది. ఇక కథలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సినిమాకే హైలైట్గా నిలవనుందట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్నారు.