Sunday, May 12, 2024
- Advertisement -

నిర్మాతలు సేఫేనా: కుర్రాడు కోటి రూపాయల క్లబ్ లో చేరిపోయాడు..!

- Advertisement -

కుమారి 21 ఎఫ్ సినిమా విడుదలకు ముందే హీరో రాజ్ తరుణ్ ను మీడియా ఒక కొశ్చన్ అడిగింది. మీరు భారీ స్థాయి పారితోషకం డిమాండ్ చేస్తున్నారంట కదా.. అని! అయితే ఆ హీరో ఆ ఆరోపణను ఖండించాడు. తను అలాంటి డిమాండ్ ఏమీ చేయలేదని అన్నాడు.

కుమారి 21 ఎఫ్ సినిమా ఒప్పుకుని చాన్నాళ్లు అయ్యిందని… సినిమా చూపిస్త మావ సినిమా ఒప్పుకున్నప్పుడే కుమారిని ఓకే చేశాను అని… అలాంటిప్పుడు ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేయడానికి అవకాశమే లేదు కదా.. అని అతడు తేల్చేశాడు.

అయితే పాత సంగతేమో కానీ.. ఇప్పుడు మాత్రం ఈ కుర్రాడు భారీగానే డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కుమారి 21 ఎఫ్ భారీ హిట్ గా డిక్లేర్డ్ కావడంతో , అందులోనూ ఈ సినిమాలో చేసిన రోల్ కు రాజ్ తరుణ్ కు మంచి పేరు కూడా రావడంతో… అతడికి పట్టపగ్గాలు లేకుండా పోయాననే ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు ఈ కుర్ర హీరో కి డిమాండ్ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో అతడు భారీ స్థాయి పారితోషకాన్నే డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తన పారితోషకాన్ని కోటి రూపాయల రేంజ్ కు తీసుకెళ్లాడట ఇతడు.

మొన్నటి వరకూ ఇతడు పొందింది ఇందులో మూడోవంతు మాత్రమే. అంటే ముప్పై లక్షల రూపాయలే ఇతడికి ఎక్కువ అనే పరిస్థితి ఉండేది. ఆ మాత్రం ఇస్తేనే ఈ హీరోకి సినిమా బడ్జెట్ సేఫ్ జోన్లో ఉంటుంది.. లేకపోతే ఎక్కువవుతుంది అనే  అభిప్రాయాలుండేవి అయితే ఇప్పుడు మాత్రం ఇతడు ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరి అతడు డిమాండ్ చేస్తే చేయొచ్చు.. ఇచ్చేది ఎవరు? అనేదే ఇప్పుడు ప్రశ్న. ఇచ్చే ఆసక్తి ఉన్న వాళ్లు ఇస్తారేమో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -