శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ – కియారా అద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తుండగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన సినిమా ఫస్ట్ సాంగ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా మారగా తమిళనాడులోని వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రకటించగా శనివారం జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు చరణ్. ఈ సందర్భంగా ఎమోషనల్ అయిన చరణ్..డాక్టరేట్ అందుకున్న క్షణం ఎప్పటికి మర్చిపోలేనిదన్నారు.
అనంతరం గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఆసక్తిరవిషయాలను వెల్లడించారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఐదు పాన్ ఇండియన్ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. శంకర్ దర్శకత్వంలో పనిచేయడం అద్భుతంగా ఉందని..ఆయనతో పనిచేయాలని చాలా మంది స్టార్లు అనుకుంటారన్నారు. ఈ సినిమా కోసం శంకర్ చాలా కష్టపడుతున్నారని.. డిఫరెంట్ స్టోరీతో ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కుతుందని మరింత క్యూరియాసిటీ పెంచేశారు చరణ్.