నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథని సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కాని సడన్గా ఈ సినిమా నుండి దర్శకుడు తేజ తప్పుకున్నారు.తేజ తానే తప్పుకున్నాడా.. లేక తప్పించారా అనేది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. తేజ సినిమా నుంచి తప్పకున్నరానే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఎన్టీఆర్ లాంటి మహా వ్యక్తి చరిత్రను తెరకెక్కించలేనేమో అనే భయంతోనే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నాను’’ అని దర్శకుడు తేజ చెప్పినట్లుగా వార్త ఒకటి బయటికి వచ్చింది.బాలయ్య – తేజ మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది.
అందుకే సినిమా నుండి తేజ తప్పుకున్నాడని సమాచారం.ఇప్పుడు ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు అనే ప్రశ్న అందరిలోను ఉంది.ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం భాద్యతలు ఒక ప్రచారం వస్తుంది.మరోవైపు బాలయ్యకు 100 సినిమా హిట్ ఇచ్చిన క్రిష్ కూడా ఈ సినిమాను టేకప్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.ఎవరు కాకుండా బాలయ్యే డైరక్షన్ భాద్యతలు తీసుకుంటాడనే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.తాజాగా ఎన్టీఆర్ బయోపిక్లోకి వివాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ వచ్చి చేరాడు.బయోపిక్ సినిమాలు తీయడంలో వర్మని మించినోడు లేడనే చెప్పాలి,రక్త చరిత్ర,వంగవీటి ఇలా వివాస్పద సినిమాలు తీసి తనకంటు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్నాడు.
టాలీవుడ్లో జరుగుతున్న తాజా వివాదం వెనుక వర్మ ఉన్నడని బహిరంగ రహస్యమే. ఈ విషయాన్ని స్వయంగా వర్మే ఒప్పుకున్నాడు.వర్మ తప్ప ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ని ఎవరు తీయలేరని కొందరి అభిప్రాయంగా తెలుస్తుంది.మరి వర్మ డైరక్షన్ అంటే బాలయ్య ఓకే చేస్తాడా!బాలయ్య ఆఫర్ చేస్తే వర్మ కాదంటాడా ! ఈ సినిమా దర్శకుడు ఎవరనేది ఆఫిషీయల్ ఎనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.