సూపర్ స్టార్ రజనీకాంత్ తన 171వ సినిమాను టీజే జ్ఞానవేల్ దర్శఖత్వంలో చేస్తున్నారు. రీసెంట్గా జైలర్ సినిమాతో ఆకట్టుకున్న రజనీ..జ్ఞానవేల్ సినిమాకు వెట్టియాన్ అనే టైటిల్ని ఖరారు చేశారు. ఇటీవలె ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
దీంతో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు రజనీ. ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్ర ఉండనుండగా దీని కోసం ఓ బాలీవుడ్ స్టార్ హీరోని సంప్రదించారట దర్శకుడు లోకేష్ కనగరాజ్. తొలుత షారుఖ్ని సంప్రదించగా ఆయన తిరస్కరించారని సమాచారం.
ఇప్పుడు అదే పాత్రని రణ్వీర్ సింగ్తో చేయించాలని లోకేష్ భావిస్తున్నారట. ఈక్రమంలోనే రణ్వీర్తో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు సమాచారం.ఈ సినిమా టైటిల్ ని ఈ నెల 22న రివీల్ చేయనున్నారు. ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో కోలీవుడ్లో సెన్సేషన్ సృష్టించారు. ఈ నేపథ్యంలో రజనీ – లోకేష్ కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.